డమరుకం పాటలు 10న
నాగార్జున, అనుష్క జంటగా నటించిన సినిమా డమరుకం. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించింది. వెంకట్ నిర్మాత. అచ్చిరెడ్డి సమర్పిస్తున్నారు. సురేష్ రెడ్డి సహ నిర్మాత. దేవిశ్రీ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాలో ని పాటల్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. మొత్తం 10 పాటలున్నాయి. ఆరుగురు రాశారు. 15 మంది పాడారు. ఈ ఏడాది దేవిశ్రీ సంగీతం అందించిన సినిమా విడుదల కావడం ఇది మూడో సారి.
దేవి, నాగార్జున కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ మొత్తం ఏడు సినిమాలు కూడా హిట్ కావడం గమనార్హం.
No comments:
Post a Comment