Tuesday, 4 September 2012

భయపెడుతున్న రామ్ గోపాల్ వర్మ

భయపెడుతున్న రామ్ గోపాల్ వర్మసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధ పడుతున్నాడు. అతను రూపొందించిన ‘భూత్ రిటర్న్స్’ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. 2003 వచ్చిన భూత్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రీడిలో తెరకెక్కుతున్న భూత్ రిటర్న్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకులు మరోసారి భయపడ్డం ఖాయమని రామ్ గోపాల్ వర్మ ధీమాగా ఉన్నాడు. ఈ భూత్ రిటర్న్స్ సినిమాలో జె.డి.చక్రవర్తి, మనీషా కొయిరాల, మధుశాలిని తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. 

No comments:

Post a Comment