
కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. క్రిష్ణా జలాల వినినియోగంలో రాయలసీమకు అన్యాయం జరిగిందనీ ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారనీ అంటున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల ఎస్పీవై రెడ్డికి ఇష్టం లేదు. డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తే కర్నూల్ జిల్లాకు అన్యాయం జరుగుతుందనేది ఆయన ఆవేదన. క్రిష్ణా జలాలపై ఇప్పటికే తాను తన పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులం సీఎంను కలిసి పరిస్థితి వివరించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనీ, దీనితో చేసేదేమీ లేక ఎస్పీవై రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను స్పీకర్ మీరాకుమార్ను కలిసి సమర్పించినట్లు తెలుస్తోది. ఇప్పటికే సీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్యమాన్ని ప్రారంభించారు. సకల సంపదలున్నా కూడా సీమ ఏమాత్రం అభివ్రుద్ధి చెందడం లేదనీ, సీమను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుతోనే సీమ బాగుపడుతుందంటూ బైరెడ్డి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి పేరిట ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి క్రిష్ణా జలాల పై రాజీనామా చేయడంతో సీమలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఇంకా మునుముందు ఏం జరుగుతుందో తెలియన పరిస్థితి నెలకొంది.


హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్కును కలిగిన ఎన్డీటీవీ చేసిన సర్వే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఊపిరాడకుండా చేస్తోంది. ఎన్డీటీవీ కంటే ముందుగా సర్వే నిర్వహించిన ఇండియాటుడే చెప్పినట్లుగానే రాష్ర్టంలో వైఎస్ఆర్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హవా కొనసాగుతున్నట్లు ఎన్డీటీవీ చెప్పింది. కాంగ్రెస్,టీడీపీ పార్టీల అడ్రస్ గల్లంతయ్యే దిశలో పయనిస్తున్నట్లు ఆ రెండు మీడియా సంస్థలు చేసిన సర్వేలు చెప్పాయి. ఇదీ ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నెతలెవరికీ మింగుడుపడటం లేదు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఏ స్థానం కలిగించారో అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇండియాటుడే, ఎన్డీటీవీ కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మాటల్ని నమ్మడం లేదు. కొత్తదనాన్ని, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదే ఉప ఎన్నికల్లో నిరూపితమైంది. అయితే, టీడీపీ నేతలందరికీ సర్వేలు మాత్రం మింగుడుపడటం లేదు. దానికి అనేక కారణాలు లేకపోలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాతనే ‘మీడియా మేనేజ్’ అనే కొత్త పదాన్ని కనుగొన్నారు. చంద్రబాబు దొంగచాటుగా సీఎంగా అయ్యిందే ‘ఈనాడు’ మీడియా సంస్థతో. ఇది జగమెరిగిన సత్యం. గతంలో రాష్ర్టంలోని, దేశంలోని పలు మీడియా సంస్థల యజమానులతో సత్సంబంధాలుండేవి. మీడియాలో తనకు అనుకూలంగా వార్తలు రాయించుకునే వారు. తాను చేయాలనుకున్నది తొలుత తనకు అనుకూలంగా ఉండేటి వంటి మీడియాల ద్వారా ఒకటికి పదిమార్లు రాయించుకునే వారు. తరువాత అమలు చేసేవారు. అదేమంటే, యావత్ మీడియా కోరుకుంటుందనీ, దానితోనే తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామనీ చెప్పేవారు. దీనికి నిదర్శనమే సారాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం. ఇలా చెప్పుకుంటే పోతే చంద్రబాబు లీలలు అనేకం ఉన్నాయి. వీటన్నింటిని అటుంచితే...ఇండియాటుడే, ఎన్డీటీవీ మీడియా సంస్థలు ఓ ప్రాంతానికి, వర్గానికి సంబంధించినవి కావు. వాటికంటూ కొన్ని విలువలు ఉన్నాయి. సమాజంలో పేరున్న మీడియా సంస్థలు. తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నట్టుగా అవి అమ్ముడు పోవాలనుకుంటే అధికార పార్టీకి అమ్ముడుపోతాయి. అధికార పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేసి ఉండేవి. అలా జరగలేదు. ఇండియాటుడే, ఎన్డీటీవీ వంటి మీడియా సంస్థలు అమ్ముడుపోయానడంకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. తమకు అనుకూలంగా ఉంటే మంచివనీ, లేకుంటే అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేయడంతో ప్రజల్లో అంతో ఇంతో ఉన్న విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంటుందే తప్ప మరొకటి కాదు. 

























